రెండు తెలుగు రాష్ట్రాల్లో గత వారం పదిరోజులుగా ఎడతెరిపిలేని వర్షాల కారణంగా , అన్ని ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి . వాగులు , నదులు పొంగిపొర్లడంతో , రోడ్లు, రైలు మార్గాలు దెబ్బతిన్నాయి . రాకపోకలు నిలిచిపోయాయి . వాహనాలు నీట మునిగాయి . బస్సులు, లారీలు నీటి మధ్య నిలిచిపోయాయి . అందులోని ప్రయాణికులను రక్షించగలిగారు . విజయవాడ వద్ద , ప్రకాశం బ్యారేజి కృష్ణవేణి శక్తిని తట్టుకోలేక , గేట్లు ఎత్తివేసింది . బ్యారేజీకి ఇరువైపులా కృష్ణవేణి సముద్రాన్ని తలపింపజేచింది . విజయవాడ ప్రజలకి , కృష్ణవేణి నిండుగా ప్రవహించడం కన్నులపండువ చేసింది . శ్రీశైలం, నాగార్జున సాగర్ లు కూడా , పూర్తిగా నిండిపోయి , నీటిని నిరంతరం బయటకి వదలాల్సి వచ్చింది జలసంపద పెరిగింది . కొంత ఆస్తి , పంట నష్టం కూడా జరిగింది
తెలంగాణా లో కూడా అన్ని నీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి . జంట నగరాలైయిన , హైదరాబాద్ - సికింద్రాబాద్ జలమయమయ్యాయి . చాలా చోట్ల రోడ్లు నడుం లోతు నీటిలో వున్నాయి . వాహనాలు నీటిలో ఆగిపోయాయి . టీవీ చానెల్స్ లో చూస్తే , పరిస్థి తి దారుణంగా కనిపించింది . చెరువుల్లో కట్టిన వందలాది అపార్టుమెంటు లు , ఒక్కొక్కటీ ద్వీపంలా కనిపించాయి . హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయి , జనాన్ని భయపెట్టింది .అపార్టుమెంటు వాసులు రాకపోకలకు మార్గం లేక విలవిలా లాడిపోయారు . నీరు పోయే మార్గం లేక , గ్రౌండ్ ఫ్లోర్ లు నిండిపోయాయి . నిత్యావసరాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు . రోడ్లు బాగా దెబ్బతిన్నాయి . ఎడతెరిపిలేని వర్షాలవల్ల , నిస్సహాకులకి సాయం అందజేయటం కూడా కష్టమయిపోయింది . ఇల్లాంటి వానలు గత 20-30 సంవత్సరాల్లో చూడలేదని కొంతమంది అంటున్నారు .
చివరకు నిన్న (25-9-2016) సూర్యదేవుడు కనిపించాడు . మునిగిన కాలనీ ల నుండి , నీటిని యంత్రాల ద్వారా బయటకు తోడిపోయటం మొదలు పెట్టారు . యధాస్థితికి , మరో వారం పట్టవచ్చు
తెలంగాణా లో కూడా అన్ని నీటి ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోయాయి . జంట నగరాలైయిన , హైదరాబాద్ - సికింద్రాబాద్ జలమయమయ్యాయి . చాలా చోట్ల రోడ్లు నడుం లోతు నీటిలో వున్నాయి . వాహనాలు నీటిలో ఆగిపోయాయి . టీవీ చానెల్స్ లో చూస్తే , పరిస్థి తి దారుణంగా కనిపించింది . చెరువుల్లో కట్టిన వందలాది అపార్టుమెంటు లు , ఒక్కొక్కటీ ద్వీపంలా కనిపించాయి . హుస్సేన్ సాగర్ పూర్తిగా నిండిపోయి , జనాన్ని భయపెట్టింది .అపార్టుమెంటు వాసులు రాకపోకలకు మార్గం లేక విలవిలా లాడిపోయారు . నీరు పోయే మార్గం లేక , గ్రౌండ్ ఫ్లోర్ లు నిండిపోయాయి . నిత్యావసరాల కోసం చాలా ఇబ్బంది పడ్డారు . రోడ్లు బాగా దెబ్బతిన్నాయి . ఎడతెరిపిలేని వర్షాలవల్ల , నిస్సహాకులకి సాయం అందజేయటం కూడా కష్టమయిపోయింది . ఇల్లాంటి వానలు గత 20-30 సంవత్సరాల్లో చూడలేదని కొంతమంది అంటున్నారు .
చివరకు నిన్న (25-9-2016) సూర్యదేవుడు కనిపించాడు . మునిగిన కాలనీ ల నుండి , నీటిని యంత్రాల ద్వారా బయటకు తోడిపోయటం మొదలు పెట్టారు . యధాస్థితికి , మరో వారం పట్టవచ్చు
No comments:
Post a Comment