కర్ణాటక సంగీత ప్రముఖ విద్వాంసులు కీ. శే . పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరపటం కోసం కొందరి సభ్యులతో ఒక కమిటీ ఏర్పడింది . దానికి పెద్ద (చైర్మన్) గా డా. మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు వున్నారు . వారితో పాటు శ్రీ అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు . వీరిద్దరూ , పంతులుగారి శిష్యులు . ఉత్సవాలు ఘనం గా జరపటం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పన కు ఒక సమావేశం జరిగింది . శ్రీ పారుపల్లి శ్రీరామచంద్ర మూర్తి , వారిద్దరి అండదండలతో , సూచనలతో ఆ సమావేశం లో ఉత్సవ కార్యక్రమాల రూప కల్పన తయారు చేశారు . సభ్యులు తలా ఒక పని చేపట్టి , ఉత్సవాలు ఘనం గా జరిపించారు .
ఇది 30 ఏళ్ళ నాటి మాట . ఆనాటి సమావేశం లో నేనూ ఒక సభ్యుని పాల్గొన్నాను . ఆ సమావేశంలో నేను కనిపెట్టినదేవిటంటే , డా. బాలమురళీకృష్ణ గారు విశ్వ విఖ్యాత కర్ణాటక సంగీత విద్వాంసులే కాదు , గొప్ప హాస్య ప్రియులు , సంభాషణా చతురులు కూడా !
ఆయన మంగళవారం సాయంత్రం (15-11-2016) న చెన్నై లో 86 ఏట కన్ను మూసారు .
No comments:
Post a Comment