Thursday, November 24, 2016

శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు

     కర్ణాటక సంగీత ప్రముఖ విద్వాంసులు కీ. శే . పారుపల్లి రామకృష్ణయ్య పంతులుగారి శత జయంతి ఉత్సవాలు విజయవాడలో జరపటం కోసం కొందరి సభ్యులతో   ఒక కమిటీ ఏర్పడింది .  దానికి పెద్ద  (చైర్మన్) గా                  డా. మంగళంపల్లి   బాలమురళీకృష్ణ గారు వున్నారు .  వారితో పాటు శ్రీ అన్నవరపు రామస్వామి గారు కూడా వున్నారు .  వీరిద్దరూ , పంతులుగారి శిష్యులు .  ఉత్సవాలు ఘనం గా జరపటం  కోసం  చేపట్టాల్సిన కార్యక్రమాల రూపకల్పన కు ఒక సమావేశం జరిగింది .  శ్రీ పారుపల్లి శ్రీరామచంద్ర మూర్తి  , వారిద్దరి  అండదండలతో , సూచనలతో  ఆ సమావేశం లో  ఉత్సవ కార్యక్రమాల రూప కల్పన  తయారు చేశారు . సభ్యులు  తలా ఒక పని చేపట్టి , ఉత్సవాలు ఘనం గా జరిపించారు .  

    ఇది 30 ఏళ్ళ నాటి మాట .    ఆనాటి సమావేశం లో నేనూ  ఒక సభ్యుని పాల్గొన్నాను .  ఆ సమావేశంలో నేను కనిపెట్టినదేవిటంటే , డా.  బాలమురళీకృష్ణ గారు  విశ్వ విఖ్యాత కర్ణాటక  సంగీత విద్వాంసులే కాదు , గొప్ప హాస్య ప్రియులు , సంభాషణా చతురులు కూడా !
     ఆయన మంగళవారం సాయంత్రం  (15-11-2016) న చెన్నై లో  86 ఏట కన్ను మూసారు . 
     వారికి శ్రద్ధాంజలి !
     

No comments: