Saturday, November 26, 2016

నల్ల ధనం !


  భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది గారు తే . 8-11-2016 న సాయంత్రం  రూ . 500/- మరియు  రూ . 1000/- నోట్లు ఆ రోజు అర్ధ రాత్రి తర్వాత చెల్లుబడి కావని  మీడియా ద్వారా ప్రకటించారు .  ప్రజలు తమ దగ్గర వున్న నోట్లు  బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ ల  ద్వారా  డిసెంబర్  ,2016 లోగా మార్చుకోవాలని చెప్పారు .  ఈ విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు .   ఇక అంతే - జనం  గందర గోళానికి గురి అయ్యారు .  చిల్లర సమస్య ఎక్కువయింది .  బ్యాంకుల్లోను , ఎటిఎం  లు  జనం బారులు తీరారు .  వారం పదిరోజులు అయినా , క్యూ బారులు తగ్గలేదని  టీవీ చానెళ్లు రొప్పుతూ రోజూ  ప్రచారం చేస్తూనే వున్నాయి . మొదట  క్యూ లో నిలబడి ఒకరు ప్రాణాలు విడిచారని  వార్త వచ్చింది . ఇక రోజు రోజుకి   ఆ సంఖ్య పెరగ సాగింది .  ఇప్పటి  (26-11-2016 )వరకు  70 మంది  క్యూ లో వుంది మరణించారని  మీడియా ద్వారా తెలుస్తోంది .  ఇలా పోయినవారి విషయం లో విపక్షాలవారు  రూ . 20 లక్షల  పరిహారం కూడా డిమాండ్ చేశారు .   ఇది ఇలా సాగుతోనేవుంది !... 

No comments: