భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోది గారు తే . 8-11-2016 న సాయంత్రం రూ . 500/- మరియు రూ . 1000/- నోట్లు ఆ రోజు అర్ధ రాత్రి తర్వాత చెల్లుబడి కావని మీడియా ద్వారా ప్రకటించారు . ప్రజలు తమ దగ్గర వున్న నోట్లు బ్యాంకులు , పోస్ట్ ఆఫీస్ ల ద్వారా డిసెంబర్ ,2016 లోగా మార్చుకోవాలని చెప్పారు . ఈ విషయంలో కొన్ని ఆంక్షలు విధించారు . ఇక అంతే - జనం గందర గోళానికి గురి అయ్యారు . చిల్లర సమస్య ఎక్కువయింది . బ్యాంకుల్లోను , ఎటిఎం లు జనం బారులు తీరారు . వారం పదిరోజులు అయినా , క్యూ బారులు తగ్గలేదని టీవీ చానెళ్లు రొప్పుతూ రోజూ ప్రచారం చేస్తూనే వున్నాయి . మొదట క్యూ లో నిలబడి ఒకరు ప్రాణాలు విడిచారని వార్త వచ్చింది . ఇక రోజు రోజుకి ఆ సంఖ్య పెరగ సాగింది . ఇప్పటి (26-11-2016 )వరకు 70 మంది క్యూ లో వుంది మరణించారని మీడియా ద్వారా తెలుస్తోంది . ఇలా పోయినవారి విషయం లో విపక్షాలవారు రూ . 20 లక్షల పరిహారం కూడా డిమాండ్ చేశారు . ఇది ఇలా సాగుతోనేవుంది !...
No comments:
Post a Comment