శ్రీ శీలా వీర్రాజు గారు ప్రసిద్ధ రచయిత , కవి , చిత్రకారులు . "మైనా " నవలకు సాహిత్య అకాడెమి పురస్కారం పొందారు . ఆయన కథా శైలి చాలా బాగుంటుంది . ఎన్నో పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశారు . వారి రచనలు , చిత్రాలు గ్రంథాలుగా వచ్చాయి . ఆయన మృదు స్వభావి . నిజాయితీగల రచయిత . ఆయన పెయింటింగ్స్ కూడా ఆయన స్వభావాన్ని తెలుపుతాయి . 1972 లో మొదటిసారిగా ఆయనను హైదరాబాద్ లో కలిసాను . వారు అప్పుడు రాష్ట్ర సమాచార శాఖలో అనువాదకులుగా వున్నారు . వ్యాపకంగా , రచనలు చిత్రాలు చేసేవారు . 1972 ఆయనను కలసినప్పుడు , నా బొమ్మల కథ "వెంకన్నా'స్ కోల్డ్ " ఆంధ్ర సచిత్ర వార పత్రికలో సీరియల్ గా వస్తోంది . అవి చూసి ఆయన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు . ఆయనను అప్పుడప్పుడు కలుస్తూ వుండేవాణ్ణి
శ్రీ వీర్రాజు గారి చిత్రకళా ప్రదర్శన విజయవాడ లో 21-1-2017 నుండి మూడు రోజులపాటు జరిగింది . ఆ సందర్భంగా ఆయన సతీ సమేతంగా విజయవాడ వచ్చేరు . ఆయన శ్రీమతి సుభద్రాదేవి గారు కూడా సంపుటాలు వెలువరించిన కవయిత్రి , రచయిత్రి .
ఈ దిగువన ఆయనతో తీసుకున్న ఫోటో , చిత్ర కళా ప్రదర్శనలో ని కొన్ని చిత్రాల ఫోటోలు చూడగలరు .
No comments:
Post a Comment