బాహుబలి సినిమా విడుదల గురించి ప్రపంచమంతా ప్రచారం జోరుగా మొదలయింది . దానితో ప్రేక్షకుల వెర్రి మరింత పెరిగింది . ఉదయం నాలుగు గంటలకే సినిమా హాళ్ల దగ్గర క్యూ లో నిలబడడం చూస్తోంటే వెర్రి బాగా ముదిరింది అనిపిస్తోంది . ఆ మధ్య ఎటిఎం క్యూ లో నిలబడ టానికి , ప్రభుత్వాన్ని దుమ్మెత్తి పోశారు . ఇప్పుడు తెల్లారక మునుపే , కిలోమీటర్ మించి వున్న క్యూ లో వెర్రి సంతోషం తో సినిమా హాళ్ల దగ్గర వుంటున్నారు . వీరంతా బాగా చదువుకున్న వాళ్ళే సుమీ .
కొందరు ఆన్ లైన్ టికెట్స్ కొంటున్నారు . అవి బోగస్ అంటున్నారు కొందరు . నవీన సినిమా హాళ్లలో , ఎక్కువ డబ్బులు వసూళ్లు చేస్తూ, పాప్ కార్న్ లేక ఓ కూల్ డ్రింక్ టోకెన్ లు ఇస్తున్నారట . చిన్న సినిమా థియేటర్ దగ్గర టికెట్ లు బ్లాక్ లో అమ్మడం మామూలు అయి పోయింది . ఇలా ఎవరికీ వారు వెర్రి ప్రేక్షకులను దోచుకోవడం మొదలు పెట్టారు . సామాన్యునికి సినిమా నాలుగు రోజులు ఆగి చూస్తే కొంపలేమీ మునిగిపోవు . కానీ - మొదటి రోజే , బాగా కలెక్షన్స్ సంపాదించాలి, లేకపోతే - నెగటివ్ టాక్ వచ్చిందంటే , కొంపలు తప్ప క మునిగిపోతాయి , అని నిర్మాతల భయం కావొచ్చు .
లాభాలు రావాలని నిర్మాతలకు శుభాకాంక్షలు . చాలా కష్టాలు పడి , మొదటిరోజున సినిమా చూసిన వెర్రి ప్రేక్షకులకు అభినందనలు !
No comments:
Post a Comment